అక్షరటుడే, వెబ్డెస్క్ : తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ములుగు(Mulugu) జిల్లా వెంకటాపురం సమీపంలో గల కర్రెగుట్ట(Karregutta)ల్లో భద్రతా బలగాల కూంబింగ్ ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.
ఈ అడవుల్లో వెయ్యి మంది మావోయిస్టులు(Maoists) ఉన్నారనే సమాచారం మేరకు కూంబింగ్(combing) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ వైపున అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్కౌంటర్(Encounter) చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు.