అక్షరటుడే, వెబ్డెస్క్: Uttar Pradesh | భర్తలను భార్యలు మోసగిస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బాగ్పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత తన భర్తను మోసగించింది. ప్రియుడితో (Boyfriend) కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. అనుమానం వచ్చిన భర్త (Husband) వారిద్దని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
సదరు వివాహిత ప్రియుడితో కలిసి హోటల్ గదిలో(hotel room) ఎంజాయ్ చేస్తోంది. కాగా.. అక్కడికి అనూహ్యంగా భర్త రావడంతో ఆమె షాకైంది. ఏకంగా హోటల్పై నుంచి కిందికి దూకి పారిపోయింది.
దీంతో ప్రియుడు శోభిత్(boyfriend Shobhit)ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సోమవారం జరిగింది. కాగా, వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉన్నందని , రక్షణ కల్పించాలని పోలీసులకు (police) భర్త ఫిర్యాదు చేశాడు. ఇక, సదరు వివాహిత హోటల్ గది నుంచి కిందికి దూకి పారిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ దంపతులకు 2019లో పెళ్లి అయింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడంతో ఎస్పీ కార్యాలయంలోని మహిళా విభాగంలో వైవాహిక కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు.
కాగా.. సదరు మహిళ బుద్ధి సరిగా లేకుంటే ఎన్ని కౌన్సెన్సిలింగ్లు ఇచ్చినా ఫలితం ఉండదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు శోభిత్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బడౌత్ ఎస్ఎచ్వో మనో జ్కుమార్ చాహల్ వెల్లడించారు.