అక్షరటుడే నిజామాబాద్ సిటీ: MP Rahul Gandhi | నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాహుల్గాంధీ ఆలోచనా విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
రాహుల్గాంధీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి (DCCB Chairman Ramesh Reddy), జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి (District Library Chairman Anta Reddy Raja Reddy), నిజామాబాద్ మార్కెట్ కమిటీ (Nizamabad Market Committee) ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ధర్మాగౌడ్, డీసీసీ డెలిగేట్ ప్రమోద్, మహిళా అధ్యక్షురాలు రేవతి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినయ్, సంగెం సాయిలు, నరేంద్ర సింగ్, ప్రవీణ్, సాయి కుమార్, మలైకా బేగం, పుప్పాల విజయ, ముశ్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు.