అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu)తో ఎమ్మెల్సీ కవిత గురువారం భేటీ అయ్యారు. తిరుపతి హతిరామ్ బావాజీ మఠం(Tirupati Hathiram Bawaji Math)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని ఆమె కోరారు.
ఈ మేరకు తెలంగాణ(Telangana)లోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి బీఆర్ నాయుడుకు వినతి పత్రం అందించారు. ఈ నెల 30న హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకు టీటీడీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు కవిత(MLC Kavitha) తెలిపారు. బంజారా పిఠాధిపతులకు హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.