అక్షరటుడే, వెబ్డెస్క్: Banakacharla Project | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్కు అనుమతులు ఇవ్వొద్దని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. ఆయన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి గురువారం మధ్యాహ్నం కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. బనకచర్లపై ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
Banakacharla Project | ఏమిటీ బనకచర్ల ప్రాజెక్ట్ వివాదం
గోదావరి నదిలో వృథాగా పోయే 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project)ను నిర్మిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలుపుతోంది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఈ నీటిని మళ్లించాలన్నది ప్రణాళిక. పోలవరం నుంచి గోదావరి జలాలను తరలించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. కాల్వలు, సొరంగాలు, ఎత్తిపోతల ద్వారా పోలవరం నుంచి నీటిని శ్రీశైలం కుడికాలువలో కీలకమైన బనకచర్ల హెడ్ రెగ్యూలేటర్ వరకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం అక్కడి నుంచి రాయలసీమకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో తెలంగాణ రైతులకు(Telangana Farmers) అన్యాయం జరుగుతోందని వాదిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.