More
    Homeఆంధ్రప్రదేశ్​YS Jagan | ఏడాదిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత : వైఎస్ జగన్​

    YS Jagan | ఏడాదిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత : వైఎస్ జగన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan | కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్​ జగన్(YS Jagan)​ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో బుధవారం తన పర్యటన విజయవంతమైందని జగన్​ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్​ ఆరోపించారు. ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వానికీ రాలేదని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించిందని ఆయన తెలిపారు.

    YS Jagan | నియంతలా మారిన చంద్రబాబు

    ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) నియంతలా మారారని జగన్​ ఆరోపించారు. ఆయన తీరులో అసంతృప్తి కనిపిస్తోందని విమర్శించారు. అణచివేతకు నిదర్శనంగా చంద్రబాబు తయారయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించడం కూడా తప్పా అన్నారు.

    READ ALSO  YS Sharmila | కేసీఆర్​, జగన్​ బంధంపై వైఎస్​ షర్మిల షాకింగ్​ కామెంట్స్​

    YS Jagan | ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..

    ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని వైఎస్​ జగన్​ ప్రశ్నించారు. ఇటీవల సాక్షి కార్యాలయాలపై(Sakshi Office) దాడులను ఆయన ఖండించారు. టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేశారని ఆరోపించారు.

    YS Jagan | తప్పుడు కేసులు పెడుతున్నారు

    కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్​ ఆరోపించారు. లిక్కర్​ స్కామ్(Liquor scam)​లో చెవిరెడ్డిని ఇరికించడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్నారు. చెవిరెడ్డి(Chevireddy) గన్‌మెన్‌ను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. చెవిరెడ్డి కుమారుడిని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పిన్నెల్లిపైనా తప్పుడు కేసులు పెట్టారని నందిగం సురేష్‌పైనా కేసుల మీద కేసులు పెడుతున్నారని జగన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    READ ALSO  TDP | తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ.. ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

    YS Jagan | పొదిలి పర్యటనలో ఇబ్బంది పెట్టారు

    ఇటీవల తన పొదిలి పర్యటనలో సైతం టీడీపీ నాయకులు(TDP Leaders) ఇబ్బందులు పెట్టారని వైఎస్​ జగన్​ అన్నారు. 40 వేల మంది వైసీపీ కార్యకర్తలు, రైతులపై 40 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసి రెచ్చగొట్టారని ఆరోపించారు. అయినా రైతులు సంయమనం పాటించారని పేర్కొన్నారు. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు. రైతులు సంయమనం పాటించినా వారిపైనే కేసులు పెట్టారని జగన్ పేర్కొన్నారు.

    Latest articles

    Operation Sindhu | ఆపరేషన్​ సింధు.. ఇజ్రాయెల్​లోని వారినీ తరలింపునకు కేంద్రం నిర్ణయం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Operation Sindhu : ఇజ్రాయెల్(Israel) - ఇరాన్(Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర...

    Iran-Israel war | ఇరాన్​ ఇజ్రాయెల్​ యుద్ధం.. మధ్యలో తల దూర్చిన అమెరికా.. ఇక రష్యా ఎంట్రీ!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran-Israel war : పశ్చిమాసియా(West Asia)లో ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ...

    Rahul Gandhi | రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Rahul Gandhi : కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ(Congress party leader Rahul Gandhi)...

    Excise Department : ఎక్సైజ్​ శాఖ ఆధ్వర్యంలో స్కూల్​ బ్యాగుల వితరణ

    అక్షరటుడే, ఆర్మూర్​: Excise Department : నిజామాబాద్ జిల్లా(Nizamabad district) ఆర్మూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్...

    More like this

    Operation Sindhu | ఆపరేషన్​ సింధు.. ఇజ్రాయెల్​లోని వారినీ తరలింపునకు కేంద్రం నిర్ణయం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Operation Sindhu : ఇజ్రాయెల్(Israel) - ఇరాన్(Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర...

    Iran-Israel war | ఇరాన్​ ఇజ్రాయెల్​ యుద్ధం.. మధ్యలో తల దూర్చిన అమెరికా.. ఇక రష్యా ఎంట్రీ!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran-Israel war : పశ్చిమాసియా(West Asia)లో ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ...

    Rahul Gandhi | రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Rahul Gandhi : కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ(Congress party leader Rahul Gandhi)...