అక్షరటుడే, వెబ్డెస్క్:Phone Tapping Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్(Phone Tapping) చేశారని సిట్(Sit) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు(Former SIB chief Prabhakar Rao)ను ఇప్పటికే పలుమార్లు సిట్ అధికారులు విచారించారు. ఈ క్రమంలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. గురువారం మరోసారి ప్రభాకర్రావును సిట్ అధికారులు విచారించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో నిందితుడు ప్రణీత్రావు(Praneeth Rao)ను బుధవారం అధికారులు 8 గంటల పాటు విచారించారు. ఎన్నికల ముందు ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్(SIB Special Operation Target)ను ఆయన లీడ్ చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే ప్రభాకర్రావు ఆదేశాల మేరకు ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసిలో పడేశాడు. ఈ క్రమంలో గురువారం ప్రభాకర్రావు, ప్రణీత్రావు ఇద్దరిని కలిపి సిట్ విచారించనుంది.