అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | జిల్లా కేంద్రంలో బుధవారం భీమ్ ఆర్మీ కార్యాలయాన్ని(Bhim Army office) ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ ఆదేశాల మేరకు కార్యాలయం ప్రారంభినట్లు జిల్లా అధ్యక్షుడు అజయ్ మదాలే తెలిపారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా డొక్క రంజిత్ను నియమించినట్లు పేర్కొన్నారు.
టీజీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ (TGO District President Aluka Kishan) ముఖ్య అతిథిగా పాల్గొని అంబేడ్కర్ ఆలోచన విధానంపై వివరించారు. కార్యక్రమంలో బీఎస్ఐ రాష్ట ఉపాధ్యక్షుడు అశోక్, నగర అధ్యక్షుడు విజయ్, భాగ్యవన్ వినయ్, దయానంద్, సాయి శ్యామ్, దావలాత్ చక్రే, షేక్ హుస్సేన్, శేఖర్, రామ్, శీను తదితరులు పాల్గొన్నారు.