More
    HomeతెలంగాణBRS | పోరుబాటకు సిద్ధమవుతున్న బీఆర్​ఎస్​.. త్వరలో ముఖ్య నేతలతో కేసీఆర్​ సమావేశం

    BRS | పోరుబాటకు సిద్ధమవుతున్న బీఆర్​ఎస్​.. త్వరలో ముఖ్య నేతలతో కేసీఆర్​ సమావేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | కొంతకాలంగా సైలెన్స్​గా ఉన్న బీఆర్ఎస్ (BRS party)​ పార్టీ మళ్లీ పోరుబాట పట్టనుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యకర్తల్లో జోష్​ నింపడంతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లడానికి గులాబీ బాస్​ యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన త్వరలోనే బీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని బీఆర్ఎస్‌ నిర్ణయం తీసుకుంది.

    BRS | కార్యకర్తల్లో అయోమయం

    కాళేశ్వరం కమిషన్​ (Kaleshwaram Commission) విచారణ, ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone tapping case), ఫార్ములా ఈ కారు రేస్​ కేసులో కేటీఆర్​ విచారణ తదితర అంశాలతో బీఆర్​ఎస్​లో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు కవిత ఎపిసోడ్​తో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు సైలెన్స్​గా ఉండిపోయారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR))​ అధికారం పోయిన నాటి నుంచి ప్రజాక్షేత్రంలోకి అంతగా వెళ్లడం లేదు. ఫామ్​హౌస్​కే పరిమితం అయినా గులాబీ బాస్​ చివరి సారి బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో మాట్లాడారు. దీంతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికి మరో ఉద్యమం చేపట్టాలని బీఆర్​ఎస్​ భావిస్తోంది.

    READ ALSO  Hyderabad | మందుబాబుల‌కి శుభ‌వార్త‌.. కొత్త బార్స్ వచ్చేశాయ్..

    BRS | సాగునీటి ప్రాజెక్ట్​లపై..

    తెలంగాణ ఉద్యమంతో అంచలంచెలుగా ఎదిగి పదేళ్లు అధికారం చేపట్టిన బీఆర్​ఎస్​.. మళ్లీ ఉద్యమం ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. గతంలో నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట సాగిన ఉద్యమంతో గులాబీ జెండా రెపరెపలాడింది. తాజాగా బీఆర్ఎస్​ సాగునీటి ప్రాజెక్ట్​లతో పాటు రైతాంగ సమస్యలపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది.

    కాళేశ్వరంపై నిర్లక్ష్యం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యంపై ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీఆర్​ఎస్​ యోచిస్తోంది. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహించారని బీఆర్​ఎస్​ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి అయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చారని ప్రజలకు వివరించనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​తో తెలంగాణకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీఆర్​ఎస్​ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ త్వరలో ముఖ్య నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.

    READ ALSO  Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు

    Latest articles

    Tamil Nadu | ప్రియుడి కోసం పెళ్లి మండపంలోనే దొంగతనం చేసిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu : ఇటీవల లవర్ కోసం కొందరు మహిళలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను...

    Donald Trump | ఐ లవ్‌ పాకిస్తాన్‌ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ వివాదాన్ని...

    Falcon business jets | ఎలైట్ క్లబ్​లోకి ఇండియా.. ఫాల్కన్ బిజినెస్ జెట్ల తయారీ భారత్​లోనే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Falcon business jets : విమానయాన రంగంలో భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే...

    Indiramma houses | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

    అక్షరటుడే, నిజాంసాగర్ : Indiramma houses : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు...

    More like this

    Tamil Nadu | ప్రియుడి కోసం పెళ్లి మండపంలోనే దొంగతనం చేసిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu : ఇటీవల లవర్ కోసం కొందరు మహిళలు ఎంతకైనా బరితెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను...

    Donald Trump | ఐ లవ్‌ పాకిస్తాన్‌ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ వివాదాన్ని...

    Falcon business jets | ఎలైట్ క్లబ్​లోకి ఇండియా.. ఫాల్కన్ బిజినెస్ జెట్ల తయారీ భారత్​లోనే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Falcon business jets : విమానయాన రంగంలో భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే...