అక్షరటుడే, ఇందల్వాయి: Cyber Crime | ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇందల్వాయి ఎస్సై సందీప్ (SI Sandeep) అన్నారు.
ఇందల్వాయి మండలంలోని గన్నారం ప్రభుత్వ పాఠశాలలో (Gannaram Government School) విద్యార్థులకు మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.