అక్షరటుడే, వెబ్డెస్క్: Begumpet Airport | హైదరాబాద్(Hyderabad)లోని పాత విమానాశ్రయం బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు(Bomb Threat) రావడంతో నగరంలో కలకలం రేగింది. బుధవారం ఉదయం 10:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ కాల్ వచ్చింది.
దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది బాంబ్ స్క్వాడ్(Bomb Squad)కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు(Security forces) ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాయి. ఎయిర్పోర్టులోని ఉద్యోగులందరినీ బయటకు పంపించి బాంబు స్క్వాడ్, ఎస్పీఎఫ్ పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి. అయితే విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని గుర్తించారు. బెదిరింపులకు పాల్పడిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. “ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయానికి(Begumpet Airport) బాంబు బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం మేము బాంబు స్క్వాడ్తో విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని” బేగంపేట అసిస్టెంట్ పోలీసు కమిషనర్ తెలిపారు.