అక్షరటుడే, ధర్పల్లి: Dharpally | పిచ్చికుక్కల దాడిలో పలువురు చిన్నారులకు గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన ధర్పల్లి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దమ్మన్నపేట (Dammanapeta) గ్రామ పరిధిలోని మరియా తండాలో ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారులు వరుణ్, హర్షిత్తో పాటు మరో బాలుడిపై పిచ్చికుక్కలు దాడి చేశాయి.
దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు చిన్నారులను మొదట ధర్పల్లి ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తరలించారు. అందులో ఓ బాబు పరిస్థితి విషయంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. గ్రామాల్లో పిచ్చికుక్కలు, కోతుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తక్షణమే వాటిని గ్రామాల నుంచి తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.