More
    HomeతెలంగాణAshwini Vaishnav | 200 కొత్త రైళ్లు.. అవన్నీ కూడా తెలంగాణలోనే తయారీనా?

    Ashwini Vaishnav | 200 కొత్త రైళ్లు.. అవన్నీ కూడా తెలంగాణలోనే తయారీనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ashwini Vaishnav | రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) శుభవార్త అందించింది. దేశంలో కొత్తగా 200 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే మంత్రిత్వశాఖ(Railways Ministry) రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. రైల్వే ప్రయాణాలపై ప్రయాణికులు చూపిస్తున్న ఆసక్తి నేపథ్యంలో వారికి సౌకర్య వంతమైన ప్రయాణాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో చాలావరకు తెలంగాణలోనే (Telangana) తయారవుతుడం విశేషం. వీటిలో అధునాతన ట్రైన్స్ ఉన్నాయి. ఇటీవలే రైల్వే ట్రాక్లు మార్చడంతో పాటు వాటి స్పీడ్ లిమిట్ కూడా పెంచడంతో దానికి తగ్గట్టుగా మోడ్రన్ రైళ్లను(Modern Trains) అందుబాటులోకి తెస్తున్నారు.

    Ashwini Vaishnav | సామాన్యుల క‌ష్టాలు తీరిన‌ట్టేనా?

    దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసారు. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్‌ రైళ్లు(50 Namo Bharat trains), 100 మెమూ రైళ్లు, 50 అమృత్‌ భారత్‌ రైళ్లు(50 Amrit Bharat trains) త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnav) ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్టు ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్‌ చేశారు. అయితే, ఈ రైళ్లును ఎప్పుడు అందుబాటులోకి తీసుకురాబోతున్నారనే వివరాలను మాత్రం ఆయన పేర్కొనలేదు. లేటెస్ట్ గా తయారైన రైళ్లలో 50 నమో భారత్ ట్రైన్స్ ఉన్నాయి. ఇవి పూర్తిగా ఏసీతో ఉండే ప్యాసింజర్ ట్రైన్స్.

    READ ALSO  TPPC Chief | టీపీపీసీ చీఫ్​ను కలిసిన కాంగ్రెస్​ నాయకులు

    ప్రయోగాత్మకంగా గుజరాత్‌లో అహ్మదాబాద్ నుంచి భుజ్, బిహార్‌లో పాట్నా నుంచి జయ్‌నగర్ వరకూ నడిపారు. వీటికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మరో 50 నమో భారత్ ఏసీ రైళ్లను(Namo Bharat AC trains) దేశవ్యాప్తంగా నడపడానికి రెడీ చేసారు. దేశవ్యాప్తంగా దగ్గర దూరాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్ళ కొరత విపరీతంగా ఉంది. దాన్ని అధిగమించడం కోసం రైల్వే శాఖ రైళ్లను రెడీ చేసింది. ఇవన్నీ తెలంగాణలోని కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ(Kazipet Railway Factory)లో తయారయ్యాయి. సాధారణంగా మెమూ రైళ్లకు 8-12 బోగీలు ఉంటాయి. కానీ కొత్తగా ప్రవేశపడుతున్న MEMU లకు 16-20 బోగీలు ఉండనున్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన నాన్-ఏసీ అమృత్ భారత్ రైళ్లు ప్రస్తుతం మూడు ఉన్నాయి. అవికాక 6రైళ్లు రెడీ అయ్యాయి. ఇప్పుడు మరొక 50 అమృత్ భారత్ ట్రైన్లను తయారు చేస్తున్నట్టు అశ్విని వైష్ణవి ప్రకటించారు.

    READ ALSO  Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. ఈ నెలాఖరులోగా షెడ్యూల్​

    Latest articles

    Khamenei | తలొగ్గేదే లేదు.. ఇరాన్ సుప్రీం ఖమేనీ స్పష్టీకరణ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Khamenei | తమపై దాడి చేసి ఇజ్రాయిల్ (Israel Attack) తప్పు చేసిందని, అందుకు...

    Formula E race case | ఏసీబీకి సెల్​ఫోన్లు ఇవ్వని కేటీఆర్​.. వ్యక్తిగత గోప్యతకు భంగం అని లేఖ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E race case | ఫార్ములా– ఈ కారు రేసు కేసు (Formula...

    TNGO’s | సీఎస్​ను కలిసిన టీఎన్జీవోస్ నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: TNGO's | టీఎన్జీవోస్ జిల్లా నాయకులు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును (Government Chief Secretary...

    Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన మహిళా కమిషన్ సభ్యులు

    అక్షరటుడే, ఇందూరు: Collector Vinay Krishna Reddy | జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని బుధవారం...

    More like this

    Khamenei | తలొగ్గేదే లేదు.. ఇరాన్ సుప్రీం ఖమేనీ స్పష్టీకరణ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Khamenei | తమపై దాడి చేసి ఇజ్రాయిల్ (Israel Attack) తప్పు చేసిందని, అందుకు...

    Formula E race case | ఏసీబీకి సెల్​ఫోన్లు ఇవ్వని కేటీఆర్​.. వ్యక్తిగత గోప్యతకు భంగం అని లేఖ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E race case | ఫార్ములా– ఈ కారు రేసు కేసు (Formula...

    TNGO’s | సీఎస్​ను కలిసిన టీఎన్జీవోస్ నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: TNGO's | టీఎన్జీవోస్ జిల్లా నాయకులు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును (Government Chief Secretary...