More
    HomeజాతీయంAadhaar Updation | గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇక ఇంట్లో నుంచే ఆధార్ అప్​డేట్​

    Aadhaar Updation | గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఇక ఇంట్లో నుంచే ఆధార్ అప్​డేట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Aadhaar Updation | దేశంలో ప్రస్తుతం ఆధార్​ కార్డు (Aadhar card) ఎంతో కీలకం. అన్నింటికీ ఆధార్​ తప్పనిసరి. పాఠశాలలో ప్రవేశాల నుంచి మొదలు పెడితే పాస్​పోర్టు వరకు ఆధార్​కార్డు ఉంటేనే సాధ్యం. అంతేగాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఆధార్​ కార్డు ఉంటేనే అందుతాయి. అయితే ఆధార్​కార్డులో తప్పులు ఉన్నవారు ఇన్నిరోజులు వాటిని సరి చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడేవారు. అయితే కేంద్రం తాజాగా అలాంటి వారికి శుభవార్త చెప్పింది. ఇక ఇంట్లో నుంచే ఆధార్​ కార్డు అప్​డేట్​ చేసుకోవచ్చని తెలిపింది.

    Aadhaar Updation | ఓటీపీ ద్వారా అప్​డేట్​

    ఆధార్​ కార్డును ఇక ఇంట్లో నుంచే అప్​డేట్​ చేసుకోవచ్చు. ఓటీపీ (OTP) ద్వారా ఈ ప్రక్రియ చేపట్టడానికి కేంద్రం అవకాశం ఇచ్చింది. గతంలో ఆధార్​కార్డు పొందిన వారిలో చాలా మందికి పుట్టిన తేది, ఇంటి పేరు, పేర్లు తప్పులుగా నమోదు అయ్యాయి. దీంతో వీరు ఆధార్​ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రభుత్వం పుట్టిన తేది, ఇంటి పేరు, పేరు మార్పు లాంటి వివరాలను ఇంటి నుంచే అప్​డేట్ (Aadhaar Update)​ చేసుకునే అవకాశం కల్పించింది. పదేళ్ల క్రితం ఆధార్​ పొంది.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్​డేట్​ చేసుకొని వారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది.

    READ ALSO  Helicopter Manufacturing Center | నాగ్‌పూర్‌లో అత్యాధునిక హెలికాప్టర్ తయారీ కేంద్రం.. మాక్స్ ఏరోస్పేస్తో ‘మహా’ సర్కారు ఒప్పందం

    Aadhaar Updation | కావాల్సిన పత్రాలు

    ఆధార్​లో మార్పులు చేయాలనుకునే వారు పోర్టల్​లోకి వెళ్లి లాగిన్​ కావాల్సి ఉంటుంది. ఇంటి పేరు మార్పు కోసం పదో తరగతి మెమో లేదా మ్యారిజ్​ సర్టిఫికెట్​ అప్​లోడ్​ చేయాలి. పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ, పాన్ కార్డ్ కూడా అప్​లోడ్​ చేయొచ్చు. చిరునామా మార్పు కోసం బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డ్, అద్దె ఒప్పందం (అద్దె ఇంట్లో నివసించేవారు) అప్​లోడ్​ చేయాలి. అనంతరం మొబైల్​కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్​ చేయగానే ఆధార్​ అప్​డేట్​ ప్రక్రియ ముగుస్తుంది.

    Aadhaar Updation | ఉచిత ఆధార్ అప్​డేట్ గడువు పొడిగింపు

    ఆధార్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్​డేట్​ చేసుకునే గడువును యూఐడీఏఐ పొడిగించింది. ఈ గడువు ఈ ఏడాది జూన్​ 14తో ముగుస్తుందని మొదట ప్రకటించింది. అయితే 2026 జూన్ 14 వరకు గడువు పొడిగించినట్లు ఎక్స్​ వేదిక ప్రకటించింది.

    READ ALSO  Air India | మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

    Latest articles

    AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం...

    Trump Mobiles | ఇక ట్రంప్‌ మొబైల్స్‌.. కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన యూఎస్‌ అధ్యక్షుడి తనయులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Mobiles : సంచలనాల ట్రంప్‌(Trump) కుమారులు నిర్వహిస్తున్న కంపెనీ మొబైల్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది....

    OnePlus | భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో.. వన్‌ప్లస్‌ నుంచి మరో రెండు ఫోన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వన్‌ప్లస్‌(OnePlus) నుంచి త్వరలో మరో రెండు మోడళ్లు విడుదల కానున్నాయి. వచ్చేనెల 8వ తేదీ నుంచి...

    Amaravati | అమరావతి ముఖ ద్వారం చూశారా.. ముస్తాబ‌వుతున్న‌ మూలపాడు..!

    అక్షరటుడే, అమరావతి: Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. విజయవాడ -...

    More like this

    AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం...

    Trump Mobiles | ఇక ట్రంప్‌ మొబైల్స్‌.. కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన యూఎస్‌ అధ్యక్షుడి తనయులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Mobiles : సంచలనాల ట్రంప్‌(Trump) కుమారులు నిర్వహిస్తున్న కంపెనీ మొబైల్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది....

    OnePlus | భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో.. వన్‌ప్లస్‌ నుంచి మరో రెండు ఫోన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వన్‌ప్లస్‌(OnePlus) నుంచి త్వరలో మరో రెండు మోడళ్లు విడుదల కానున్నాయి. వచ్చేనెల 8వ తేదీ నుంచి...