అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ రేసు (Formula E Race) కేసులో అక్రమాలు, మాజీ మంత్రి ప్రమేయంపై ఆధారాలు సేకరించేందుకు ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటీకే ఈ కేసుల్లో కేటీఆర్ను రెండుసార్లు విచారించింది. రేపటిలోగా సెల్ఫోన్, ల్యాప్టాప్ అప్పగించాలని కేటీఆర్ను ఏసీబీ ఆదేశించింది.
కేటీఆర్ వాడిన సెల్ఫోన్, మ్యాక్బుక్, ట్యాబ్లో కీలక సమాచారం ఉందని ఏసీబీ భావిస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచే కేటీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొంటుంది. మరోవైపు న్యాయసలహా ప్రకారం నడుచుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా డాక్యుమెంట్లను ఏసీబీ తయారు చేస్తోంది. త్వరలోనే కీలక ఆధారాలతో ఏసీబీ తుది నివేదిక సిద్ధం చేయనుంది.
KTR | అరెస్ట్ తప్పదా..
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ను కీలక నిందితుడిగా ఏసీబీ (ACB) చేర్చింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో సైతం కేటీఆర్ శిక్షార్హుడ ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే సిట్ ఈ కేసును విచారిస్తోంది. ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలపై కేసులు పెట్టడానికి సిద్ధం అవుతోంది. దీంతో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఏసీబీ విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ తనను అరెస్ట్ చేస్తే 15 రోజులు జైలులో రెస్ట్ తీసుకుంటానని వ్యాఖ్యానించడం గమనార్హం. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.