అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ కొత్త లోగో తమ పనీతిరుని ప్రతిబింబిస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు శాఖలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న ఎస్పీ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన కొత్త లోగోను ఆవిష్కరించారు. కొత్త లోగోపై ‘FEARLESS ALWAYS.. VIGILENT FOREVER’ అనే క్యాప్షన్ను జోడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో భయానికి తావులేదని, అజాగ్రత్తకు అవకాశమే లేదన్నారు.
ఇందులో ప్రతిబింబించే నినాదం జిల్లా పోలీసుల నిబద్ధతను, కమిట్మెంట్ను స్పష్టంగా వ్యక్తపరుస్తోందని తెలిపారు. ఈ లోగో కేవలం పోలీసుల గుర్తింపు మాత్రమే కాదని, కామారెడ్డి పోలీస్ శాఖ నిబద్ధత, ప్రజలపై బాధ్యతా భావం, న్యాయబద్ధమైన విధానాలను ప్రతిబింబిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజనల్ ఏఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy), ఎల్లారెడ్డి, బాన్సువాడ డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.