అక్షరటుడే, వెబ్డెస్క్:Air India | మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అహ్మదాబాద్(Ahmedabad) నుంచి లండన్(London) వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య రావడంతో పైలెట్(Pilot) విమానాన్ని నిలిపివేశారు. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం నంబర్ ఏఐ 171 కూలిపోవడంతో ఆ నంబర్ను ఎయిర్ ఇండియా(Air India) తొలగించింది. మృతుల గౌరవర్థం ఆ నంబర్ వినియోగించకూడదని నిర్ణయించింది. దాని స్థానంలో ఏఐ 159 విమానం లండన్–అహ్మదాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. అయితే ఈ విమానంలో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. 200 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 1.10కి విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యను గుర్తించి పైలట్ ఫ్లైట్ను నిలిపివేశారు.