More
    HomeతెలంగాణRythu Bharosa | రెండు ఎకరాల్లోపు రైతులకు రైతుభరోసా జమ

    Rythu Bharosa | రెండు ఎకరాల్లోపు రైతులకు రైతుభరోసా జమ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా(Ryrthu Bharosa) నిధులు జమ చేస్తోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతు భరోసా నిధులను సోమవారం సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లోజమ చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం సాయంత్రం రేవంత్​రెడ్డి నిధులు విడుదల చేయగా రాత్రి వరకు రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు నిధులు జమ అయ్యాయి.

    Rythu Bharosa | ఎప్పుడు లేనంత వేగంగా..

    రాష్ట్రంలో ఎప్పుడైనా రైతు భరోసా మొదట ఎకరంలోపు రైతులకు(Farmers) విడుదల చేసేవారు. అనంతరం రెండు, తర్వాత మూడు ఎకరాల్లోపు.. ఇలా విడతల వారీగా నిధులు విడుదల చేసేవారు. కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress government) వచ్చాక అయితే నిధుల విడుదలతో తీవ్ర జాప్యం నెలకొంది. గత యాసంగి సీజన్​కు సంబంధించి నాలుగు ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు నిధులు జమ కాలేదు. అయితే వానాకాలం సీజన్​కు మాత్రం వేగంగా రైతు భరోసా జమ చేస్తుండడం గమనార్హం.

    READ ALSO  CM Revanth Reddy | ఢిల్లీలో ముగిసిన సీఎం పర్యటన.. మారనున్న మంత్రుల శాఖలు!

    Rythu Bharosa | 41.25 లక్షల రైతులకు..

    రాష్ట్ర ప్రభుత్వం(State Government) తొలిరోజు రెండు ఎకరాల్లో భూమి ఉన్న 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. ఇందులో ఎకరాల్లోపు భూమి ఉన్న వారు 24,22,678 మంది, ఎకరా నుంచి రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న వారు 17,02,611 మంది రైతులు ఉన్నారు. మొత్తం 41.25 లక్షల రైతుల ఖాతాల్లో 39.16 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,349 కోట్లు జమ చేసింది. మంగళవారం మూడు ఎకరాల్లో భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. తొమ్మిది రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.

    Rythu Bharosa | రైతుల హర్షం

    ప్రస్తుతం రాష్ట్రంలో వానలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో వరినాట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సకాలంలో పెట్టుబడి సాయం జమ చేయడంతో రైతులు(Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు తొమ్మిది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తే సాగు పెట్టుబడి ఎంతో ఉపయోగ పడతాయని రైతులు పేర్కొంటున్నారు.

    READ ALSO  MLC Kavitha | రేవంత్​రెడ్డి అసమర్థ సీఎం.. ఎమ్మెల్సీ కవిత

    Latest articles

    CP Sai Chaitanya | వృద్ధురాలికి న్యాయం చేయండి: సీపీ ఆదేశం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | న్యాయం చేయాలని కోరుతూ సీపీ కార్యాలయానికి వచ్చిన ఓ...

    Thug Life | క‌ర్ణాట‌క‌లో “థ‌గ్‌లైఫ్‌”కు తొల‌గిన అడ్డంకులు.. సినిమా విడుద‌ల చేయాల‌ని సుప్రీం సూచ‌న‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Thug Life : సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌(Film actor Kamal Haasan)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో...

    Yellareddy | అడవిలింగాలలో ఘనంగా బోనాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని అడవి లింగాలలో మంగళవారం బోనాల పండుగను (Bonalu Festival) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....

    Nizamsagar | అంజనాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని బ్రాహ్మణపల్లి(Brahmanpalli) గ్రామ శివారులో కొలువైన అంజనాద్రి క్షేత్రంలో మంగళవారం పిట్లం(Pitlam) మాజీ...

    More like this

    CP Sai Chaitanya | వృద్ధురాలికి న్యాయం చేయండి: సీపీ ఆదేశం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | న్యాయం చేయాలని కోరుతూ సీపీ కార్యాలయానికి వచ్చిన ఓ...

    Thug Life | క‌ర్ణాట‌క‌లో “థ‌గ్‌లైఫ్‌”కు తొల‌గిన అడ్డంకులు.. సినిమా విడుద‌ల చేయాల‌ని సుప్రీం సూచ‌న‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Thug Life : సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌(Film actor Kamal Haasan)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో...

    Yellareddy | అడవిలింగాలలో ఘనంగా బోనాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని అడవి లింగాలలో మంగళవారం బోనాల పండుగను (Bonalu Festival) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....