అక్షరటుడే, వెబ్డెస్క్:PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజులు సైప్రస్(Cyprus) వెళ్లిన విషయం తెలిసిందే. మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్(President Nikos Christodoulides) ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించి కెనడాలో జరుగుతున్న జీ–7 సదస్సులో పాల్గొనడానికి బయలు దేరారు. అయితే 23 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం గమనార్హం.
ప్రధాని మోదీ(Prime Minister Modi) తన పర్యటన సందర్భంగా సైప్రస్ ప్రథమ మహిళ ఫిలిప్పా కర్సెరాకు వెండి క్లచ్ పర్స్ను బహుమతిగా ఇచ్చారు. దీనిని ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)లో తయారు చేయడం గమనార్హం. రిపౌస్ టెక్నిక్ ఉపయోగించి వెండితో దీనిని తయారు చేశారు. ఈ పర్సు మధ్యలో ఒక విలువైన రాయి కూడా ఏర్పాటు చస్త్రవారు. అలాగే మోదీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్కు కాశ్మీరీ సిల్క్ కార్పెట్(President Nikos Kashmiri silk carpet)ను బహుమతిగా ఇచ్చారు. ఇది చూడటానికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. చూసే కోణం, వెలుతురును బట్టి వివిధ రంగుల్లో కనిపించడం ఈ కార్పెట్ ప్రత్యేకత.
PM Modi | అత్యున్నత పురస్కారంతో సత్కరించిన సైప్రస్
తమ దేశంలో పర్యటించిన ప్రధాని మోదీని సైప్రస్ ప్రభుత్వం(Cyprus Government) ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న మోదీ.. ఇది రెండు దేశాల చిహ్నానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆయన సైప్రస్ పర్యటన ముగించుకొని జీ–7 సదస్సులో పాల్గొనడానికి కెనడా వెళ్లారు.