అక్షరటుడే, వెబ్డెస్క్:Israel – Iran | ఇజ్రాయెల్– ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరిట ఇరాన్లోని అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేపడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో టెల్ అవీవ్పై విరుచుకు పడుతోంది.
రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకోవడంతో పశ్చిమాసియాలో ఆందోళన నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంటుంది. అయినా కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్(Israel)లోని పలు ప్రాంతాల్లో పడ్డాయి. ఈ క్రమంలో పలువురు ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. దీంతో టెల్అవీవ్(Tel Aviv) దాడులను మరింత తీవ్రం చేసింది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అండర్ గ్రౌండ్లో ఆయన కుటుంబంతో కలిసి దాక్కునట్లు తెలుస్తోంది.
Israel – Iran | ఖమేనీ లక్ష్యంగా దాడులు
ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన పేరిట తొలిరోజు కీలక అణుస్థావరాలను ధ్వంసం చేసింది. అంతేగాకుండా ఆర్మీ అధికారులు, అణు శాస్త్రవేత్తలపై దాడి చేసి హతమార్చింది. సుమారు 200 యుద్ధ విమానాలతో టెల్ అవీవ్ దాడులకు పాల్పడటం గమనార్హం. అంతకు ముందే ఇజ్రాయెల్ నిఘా సంస్థ(Israel intelligence agency) ఇరాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలను, రాడార్లను కోవర్టు ఆపరేషన్ ద్వారా నిర్వీర్యం చేశాయి. దీంతో ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అడ్డుకోలేకపోయింది. అయితే ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ(Supreme Commander Khamenei) ఇంటి సమీపంలో సైతం ఐడీఎఫ్ దాడులకు పాల్పడటం గమనార్హం. అణు ఒప్పందం చేసుకోవాలని హెచ్చరికంగా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.