More
    HomeతెలంగాణRythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    Rythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rythu Nestham | రైతులకు వ్యవసాయ సూచనలు అందించడానికి ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని పలు రైతు వేదికల్లో రైతు నేస్తం అమలు అవుతోంది. ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అధికారులు అందించే సలహాలు, సూచనలను రైతులు(Farmers) వినే అవకాశం ఉంటుంది. తాజాగా ప్రభుత్వం మరిన్ని రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ అమలు చేయాలని నిర్ణయించింది.

    Rythu Nestham | 1,034 రైతు వేదికల్లో..

    రాష్ట్రంలో ఇప్పటికే 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్(Video conference) సౌకర్యం కల్పించారు. ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో మంది రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం మరో 1,034 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు అందుకు సంబంధించిన పరికరాలు ఇప్పటికే వచ్చాయి. వాటిల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించనున్నారు.

    READ ALSO  Prashanth Reddy | బీజేపీ ఎంపీలను గెలిపించిన సీఎం రేవంత్.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    Rythu Nestham | రైతులతో మాట్లాడనున్న సీఎం

    రైతు నేస్తం(Rythu Nestham) కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడనున్నారు. ఇప్పటికే వానాకాలం సాగు సీజన్​ ప్రారంభం కావడంతో పనుల గురించి ఆయన ఆరా తీయనున్నారు. రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) కోరారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏర్పాట్లపై ఆదేశాలు ఇచ్చామన్నారు.

    Rythu Nestham | ఊరికి దూరంగా రైతు వేదికలు

    బీఆర్​ఎస్​ హయాంలో క్లస్టర్​ గ్రామాల వారీగా రైతు వేదికలు నిర్మించారు. అయితే చాలా గ్రామాల్లో వీటిని గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేశారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. వేదికల్లో ఏర్పాటు చేసిన సామగ్రిని దొంగలు చోరీ చేశారు. కొందరు ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా రైతు వేదిక(Rythu Vedika)లను వినియోగిస్తున్నారు. అంతేగాకుండా అందులోని వస్తువులు చోరీకి గురయ్యాయి. కొన్ని చోట్లు కిటికీలు, తలుపులను కూడా ఆకతాయిలు ధ్వంసం చేశారు. తాజాగా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్​ పరికరాలు అందులో పెడితే ఉంచుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    READ ALSO  Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతుభరోసా, బోనస్​పై కీలక ప్రకటన

    Latest articles

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    More like this

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...