అక్షరటుడే, వెబ్డెస్క్:Gadwal | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది చనిపోతున్నారు. అయినా చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) పాటించడం లేదు. పలువురు అయితే ప్రమాదకరంగా రోడ్లపై వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను సైతం రిస్క్లో పెడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే జోగులాంబ(Jogulamba) గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది.
గద్వాల(Gadwal) జిల్లా మానవపాడు మండల పరిధి 44వ జాతీయ రహదారిపై ఓ యువకుడు ట్రాక్టర్(Tractor)ను ప్రమాదకరంగా డ్రైవ్ చేశాడు. ట్రాక్టర్పై తాపీగా పడుకొని నడుపుతూ వెళ్లాడు. వెనకాల వస్తున్న ఓ వాహనదారుడు దీనిని వీడియో తీశాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నడిరోడ్డుపై ఇలా వాహనం నడిపితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.