More
    HomeతెలంగాణEatala Rajendar | కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్​.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

    Eatala Rajendar | కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్​.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Eatala Rajendar | కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)​పై బీజేపీ నేత, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాళేశ్వరం ఓ అద్భుతమైన వరమని ఆయన పేర్కొన్నారు. ఓ టీవీ ఛానెల్​తో మాట్లాడుతూ.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్​ అవుతున్నాయి.

    ఈటల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో ఎండాకాలంలో తెలంగాణ(Telangana)లో చెరువులు మత్తడి దూకాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో వాగులు పారాయని, చెరువులు నిండాయని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​తో పాటు చెక్​డ్యాములు కట్టడంతో నేడు తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్​తో ఎస్సారెస్పీ ఆయకట్టు 14.8 లక్షల ఎకరాలకు నీరు అందిందని పేర్కొన్నారు. ఎండాకాలంలో కూడా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో కూడా నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయంటే కాళేశ్వరమే కారణం అన్నారు.

    READ ALSO  Shamshabad Airport | ఎయిర్​పోర్టులో దెయ్యాలు.. అసలు విషయం ఏంటంటే?

    కాళేశ్వరం ఎత్తిపోతలతో వచ్చే కరెంట్​ బిల్లు సంగతి పక్కన పెడితే.. ఈ ప్రాజెక్ట్​తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్​ వచ్చాక రైతులు (Farmers) మళ్లీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం వివాదం చేయకుండా వాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రాజెక్ట్​ నిర్మాణ సమయంలో నచ్చిన వారికి కాంట్రాక్ట్​లు ఇచ్చారో లేదో తనకు తెలియదన్నారు.

    Eatala Rajendar | రాజకీయ వర్గాల్లో చర్చ

    కాళేశ్వరం ప్రాజెక్ట్​పై ఈటల రాజేందర్​ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. బీఆర్​ఎస్(BRS)​ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్​ఎస్​ ఆయనను పక్కన పెట్టింది. మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో గెలిచారు. అప్పటి నుంచి కేసీఆర్​, బీఆర్​ఎస్​ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన తాజాగా కాళేశ్వరం అద్భుతమని పొగడటం గమనార్హం.

    READ ALSO  Rain Alert | ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన

    బీజేపీ నాయకులు కాళేశ్వరంతో ఉపయోగం లేదని, ఇందులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్​ ఆ ప్రాజెక్ట్​తో రైతులకు మేలు అని వ్యాఖ్యానించడం గమనార్హం. మేడిగడ్డ(Medigadda) కుంగుబాటు, కాళేశ్వరంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్​ కాళేశ్వరం కమిషన్​ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ ఎదుట జూన్​ 5న ఈటల రాజేందర్​ విచారణకు హాజరయ్యారు. మంత్రివర్గంలో చర్చించాకే పనులు చేపట్టామని ఆయన కమిషన్​కు వివరించారు. బ్యారేజి నిర్మాణం మేడిగడ్డకు మార్చడంపై స్పందిస్తూ.. సాంకేతిక అంశాలు తమకు తెలియదని, అధికారుల సూచన మేరకు చేపట్టామన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్​తో తెలంగాణకు ఎంతో మేలు అని వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

    READ ALSO  Bhiknoor | టీపీసీసీ ప్రధాన కార్యదర్శికి శుభాకాంక్షల వెల్లువ

    Latest articles

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    More like this

    Navodaya schools | గుడ్​న్యూస్​.. నవోదయ బడుల ప్రారంభం అప్పటి నుంచే..

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...