More
    Homeఅంతర్జాతీయంHighest Population | అత్య‌ధిక జ‌నాభా ఇండియాలోనే.. ప్ర‌పంచ జ‌నాభాలో భార‌త్‌దే ఫ‌స్ట్ ప్లేస్‌

    Highest Population | అత్య‌ధిక జ‌నాభా ఇండియాలోనే.. ప్ర‌పంచ జ‌నాభాలో భార‌త్‌దే ఫ‌స్ట్ ప్లేస్‌

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: highest population : అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా భార‌త్ రికార్డులకెక్కింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జనాభా క‌లిగిన దేశంగా ఇండియా India మొద‌టి స్థానంలో నిలిచింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ (World Population Review – WPR) అంచనాల ఆధారంగా 1.46 బిలియ‌న్ల‌ జ‌నాభాతో భార‌త్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా, 1.42 బిలియ‌న్ల‌ పాపులేష‌న్‌తో చైనా China రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది. ఇండియాలో జ‌నాభా పెరుగుద‌ల అనేక దశాబ్దాల పాటు కొనసాగుతుందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనా వేయబడింది. గ‌తంలో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా చైనా ముందుండేది. అయితే, అక్క‌డ కుటుంబ నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో వృద్ధి రేటు మంద‌గించింది. అదే స‌మ‌యంలో భార‌త్‌లో జ‌నాభా వృద్ధి పెరుగ‌డం ప్రారంభ‌మైంది. రెండు, మూడు ద‌శాబ్దాలుగా జ‌న‌న రేటు పెరుగ‌డంతో ఇండియా చైనాను అధిగ‌మించి ఫ‌స్ట్ ప్లేస్‌లోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం భార‌త జ‌నాభా 146 కోట్లకు చేరుకుంది.

    READ ALSO  Donald Trump | ట్రంప్​ – మస్క్​ వివాదం వేళ.. అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన

    highest population : మూడో ప్లేస్‌లో అమెరికా

    146 కోట్ల జ‌నాభాతో ఇండియా మొదటి స్థానంలో ఉండ‌గా, చైనా రెండో స్థానంలో ఉంది. అగ్ర‌రాజ్యం అమెరికా 34.72 కోట్ల జ‌నాభాతో మూడో స్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాత స్థానాల్లో ఇండోనేషియా Indonesia (28.57 కోట్లు), పాకిస్తాన్ Pakistan(25.52 కోట్లు) , నైజీరియా Nigeria (23.75కోట్లు), బ్రెజిల్ Brazil (21.28 కోట్లు), బంగ్లాదేశ్ Bangladesh (17.56 కోట్లు), రష్యా Russia (14.39 కోట్లు), ఇథియోపియా Ethiopia(13.54 కోట్లు) నిలిచాయి. మెక్సికో(Mexico), జపాన్(Japan), ఈజిప్ట్(Egypt), ఫిలిప్పీన్స్(Philippines), కాంగో(Congo), వియత్నాం(Vietnam) వంటి దేశాల జ‌నాభా ప‌ది కోట్ల‌కు పైగానే ఉంది.

    highest population : త‌గ్గుతున్న వార్షిక వృద్ధి రేటు

    ప్రపంచ జనాభా world population పెరుగుతూనే ఉన్నప్పటికీ, వార్షిక వృద్ధి రేటు మందగిస్తోంది. 2025లో ఈ రేటు సంవత్సరానికి దాదాపు 0.85 శాతానికి ప‌డిపోయింది. ఇది 2015లో 1.25 శాతంగా ఉండ‌గా, .2020 నాటికి 0.97 శాతానికి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం వార్షిక జ‌నాభా వృద్ధి రేటు 0.85 శాతానికి ప‌రిమిత‌మైంది. ప్రస్తుత ప్రపంచ జనాభా దాదాపు 8.2 బిలియన్లు. సంవత్సరానికి 70 మిలియన్ల మేర జ‌నాభా పెరుగుతుందని అంచనా. 2037 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సంతానోత్ప‌త్తి రేటు కూడా త‌గ్గిపోయింది. ఉరుకుల ప‌రుగులు జీవ‌నం, మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు సంతానోత్ప‌త్తి రేటుపై ప్ర‌భావం చూపాయి.

    READ ALSO  NEET Score Scam | ముంబైలో నీట్ స్కోర్ బాగోతం.. ఇద్దరిని అరెస్ట్​ చేసిన సీబీఐ

    highest population : పెరిగిన ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌

    ప్ర‌పంచ జ‌నాభాలో అత్య‌ధికంగా ప‌ట్ట‌ణాల్లోనే నివ‌సిస్తున్నారు. ఆధునిక కాలంలో చ‌దువు, ఉద్యోగాల పేరిట పెద్ద సంఖ్య‌లో ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స పోతున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రామీణ వ్య‌వ‌స్థ క‌నుమ‌రుగ‌వుతుండ‌గా, ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ జ‌నాభాలో 57% కంటే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, ఇది 2050 నాటికి 68%కి చేరుకుంటారని అంచనా.

    Latest articles

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్‌పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్‌ తదితర...

    More like this

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...