అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | గౌడ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని గౌడ అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయాగౌడ్ అన్నారు. పదో తరగతి (SSC), ఇంటర్ (Inter) ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన జిల్లాలోని గౌడ విద్యార్థులను ఆదివారం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఆయన మాట్లాడుతూ.. ఉత్తమంగా చదివి ఆర్థిక పరిస్థితి బాగాలేని పేద విద్యార్థులకు గౌడ సంఘం హాస్టల్లో వసతితో పాటు ఉచిత విద్యకు సహకారం అందిస్తామన్నారు. అనంతరం గోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల ఛైర్మన్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, చక్రధర్ గౌడ్, రవీందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.