అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో మే 15 నుంచి భక్తుల తాకిడి విపరీతంగా కొనసాగుతోంది. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ వల్ల భక్తులకు దర్శన సమయం రెండు, మూడు గంటలు పైగానే తగ్గుతుంది. దీనివల్ల ఆ రోజు కేవలం 60 నుంచి 65 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు ఉంటుంది.
కానీ, ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ, టీటీడీ(TTD) సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే May, జూన్ June మాసాలలోని శుక్రవారాలలో సుమారు పది వేల మందికి పైగా భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కల్పించారు.
Tirumala : ఒకసారి దర్శన గణాంకాలు పరిశీలిస్తే..
శుక్రవారాలైన మే 23న 74,374 మంది, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది భక్తులు శ్రీవారి దర్శనం(Srivari darshan) చేసుకున్నారు. ఇక జూన్ 13న రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.