More
    Homeబిజినెస్​Chinese phones | భారత్​లో చైనా ఫోన్ల తయారీ.. విదేశాలకు ఎగుమతి.. ఫలిస్తున్న కేంద్ర ప్రభుత్వ...

    Chinese phones | భారత్​లో చైనా ఫోన్ల తయారీ.. విదేశాలకు ఎగుమతి.. ఫలిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Chinese phones : ఎగుమతులను ప్రోత్సహించడానికి, దేశీయంగా కర్మాగారాల విస్తరణకు భారత ప్రభుత్వం(Indian government) చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్(Chinese smartphone), ఎలక్ట్రానిక్ కంపెనీలు(electronics companies) మన దేశంలో తయారు చేస్తున్న తమ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నాయి. ఇండియాలో ఉన్న ఆయా కంపెనీల ప్లాంట్లలో తయారయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పశ్చిమాసియా, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాయి. ఆయా దేశాలకు గతంలో చైనా, వియత్నాం ఎక్కువగా ఎలక్ట్రానిక్ గూడ్స్, స్మార్ట్ ఫోన్స్ ఉత్పత్తి చేసేవి. కేంద్ర ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

    ఒప్పో మొబైల్స్ ఇండియా(Oppo Mobiles India) 2024 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి ద్వారా రూ.272 కోట్ల ఆదాయం ఆర్జించగా, రియల్ మీ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (ఇండియా) రూ.114 కోట్లు ఆర్జించినట్లు నివేదించిందని మే 12న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు దాఖలు చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు, హిస్సెన్స్ గ్రూప్ ఇండియాలో తయారైన టెలివిజన్లు, ఇతర వస్తువులను వచ్చే ఏడాది ప్రారంభంలో పశ్చిమాసియా(West Asian), ఆఫ్రికన్(African) మార్కెట్లకు రవాణా చేయడం ప్రారంభించాలని యోచిస్తోంది.

    READ ALSO  pre market analysis | ఎరుపెక్కిన గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌గా గిఫ్ట్‌ నిఫ్టీ

    Chinese phones : కేంద్రం ఒత్తిడితో ఇండియాలోనే ఉత్పత్తి..

    2020లో CHINA సరిహద్దు ఉద్రిక్తతలు చెలరేగినప్పటి నుంచి భారత్ ఆ దేశానికి చెందిన కంపెనీలపై అనధికారికంగా నియంత్రణ చర్యలు విధించింది. ప్రధానంగా ఇండియాలోనే తయారీ చేయాలని సూచించింది. భారతీయ భాగస్వాములతో కలిసి పనిచేయడం, దేశీయ పంపిణీ నెట్వర్ లను నిర్మించడం, ఇండియా నుంచి ఎగుమతి చేయడం, భారతీయులను సీనియర్ హోదాల్లోకి చేర్చడం వంటి మార్గదర్శకాలను విధించింది. ఈ నేపథ్యంలో మొదటి మూడు లక్ష్యాలు దాదాపు పురోగతి దశలో ఉన్నాయి. అయితే, చైనాకు చెందిన ఏ ప్రధాన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇంకా భారతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ను నియమించకోలేదు.

    Chinese phones : ఎగుమతుల వెల్లువ

    లెనోవా గ్రూప్ (Lenovo Group) త్వరలో భారతదేశంలో అసెంబుల్ చేసిన సర్వర్లు, ల్యాప్ టాప్ లను ఎగుమతి చేస్తుంది. డిక్సన్ టెక్నాలజీస్ నుంచి ఇప్పటికే అమెరికాకు రవాణా చేయబడిన మోటరోలా స్మార్ట్ ఫోన్లను పూర్తి చేస్తుంది. ట్రాన్స్షన్ హోల్డింగ్స్ ఐటెల్, టెక్నో, ఇన్ఫినిక్స్ బ్రాండ్ల కోసం హ్యాండ్సెట్లను కూడా తయారు చేసే డిక్సన్, విదేశీ ఆర్డర్లను తీర్చడానికి ఇండియాలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 శాతం విస్తరిస్తోంది. ట్రాన్స్షన్ ఆఫ్రికాకు షిప్మెంట్లను పంపడం ప్రారంభించింది. హైయర్ తో పాటు వివో, వన్ ప్లస్, షియోమి వంటి బ్రాండ్లు ఎగుమతి భాగస్వామ్యాలపై చర్చలు జరుపుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

    READ ALSO  NSDL IPO | త్వరలో ఐపీవోకు ఎన్‌ఎస్‌డీఎల్.. ఏకంగా 40శాతం పెరిగిన షేరు ధర

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి అత్యధికంగా ఎగుమతయ్యే వస్తువుల్లో స్మార్ట్ ఫోన్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. వీటి ఎగుమతులు సంవత్సరానికి 55 శాతం పెరిగి 24.14 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆపిల్ దాదాపు 17.4 బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తులను ఇండియా నుంచి ఎగుమతి చేశాయి. తర్వాతి స్థానంలో శాంసంగ్ Samsung నిలిచింది. ఇప్పుడు ఈ జాబితాలో చేరడానికి చైనీస్ బ్రాండ్ల సమూహం క్యూ కడుతోంది.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....