అక్షరటుడే, వెబ్డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు (Prabhakar rao) విచారణ మూడో రోజు ముగిసింది. శనివారం సిట్ (SIT) అధికారులు ఆయనను తొమ్మిది గంటల పాటు విచారించారు. శుక్రవారం సిట్ అధికారులు ఈ కేసులో ప్రణీత్రావును మళ్లీ విచారించారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. అనంతరం ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
Phone Tapping Case | మూడో సారి..
సిట్ అధికారులు ప్రభాకర్రావును మూడు రోజులు విచారించారు. మొదట జూన్ 9న 8 గంటల పాటు ఆయనను విచారణ జరిపారు. అనంతరం జూన్ 11న, శనివారం తొమ్మిది గంటల చొప్పున ఎస్ఐబీ మాజీ చీఫ్ను ఇన్వెస్టిగేట్ చేసింది. అయితే ఆయన విచారణకు సహకరించడం లేదని సమాచారం. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాట వేసినట్లు తెలిసింది. కాగా.. ఈ నెల 17న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్రావును సిట్ ఆదేశించింది.
బీఆర్ఎస్(BRS) హయాంలో ఎస్ఐబీ చీఫ్ (SIB Chief)గా కొనసాగిన ప్రభాకర్రావు ప్రతిపక్ష నాయకులతో పాటు, సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణకు సిట్ను నియమించింది. అయితే ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ఇన్ని రోజులు అమెరికాలో ఉండటంతో విచారణ ముందుకు జరగలేదు. అయితే సుప్రీంకోర్టు ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడంతో జూన్ 8న హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో సిట్ అధికారులు ఆయనను మూడు సార్లు విచారించారు.