అక్షరటుడే, బోధన్: Community Contact Program | శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) అన్నారు. సాలూర మండల కేంద్రంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువపత్రాలు లేని సుమారు 70 వాహనాలను సీజ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దన్నారు. మైనర్లు వాహనాలు (Minor driving) నడిపితే వారి తల్లిదండ్రులకు జరిమానాలు వేస్తామని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బోధన్ టౌన్, రూరల్ సీఐలు వెంకట్ నారాయణ (CI Venkat Narayana), విజయ్బాబు(CI vijay Babu), రూరల్ ఎస్సై మచ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.