అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లా పోలీసు శాఖలో ఇటీవల బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బదిలీలకు సంబంధించిన వివరాలను శనివారం ఓ ప్రకటనలో వివరించారు.
నాలుగైదు రోజులుగా కామారెడ్డి (Kamareddy), ఎల్లారెడ్డి, బాన్సువాడ (Banswada) సబ్ డివిజనల్ పరిధిలో హోంగార్డు నుంచి ఏఎస్సై స్థాయి వరకు బదిలీల ప్రక్రియను వ్యక్తిగతంగా అధికారులతో కౌన్సెలింగ్ ద్వారా విల్లింగ్ స్టేషన్లు, స్పౌస్ ప్రిఫరెన్స్, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, సేవా రికార్డుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో ముగించినట్లు తెలిపారు. జిల్లాలో 79 మంది హోంగార్డులు, 63 మంది సివిల్, ఏడుగురు ఎంప్టీ సెక్షన్ ఏఆర్ కానిస్టేబుల్స్, 20 మంది సివిల్ హెడ్ కానిస్టేబుల్స్, 23 మంది ఏఎస్సైలకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.