అక్షరటుడే, వెబ్డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash)పై యావత్ దేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. అయితే విమాన ప్రమాదంపై ఓ డిప్యూటీ తహశీల్దార్ అనుచిత వ్యాఖ్యలు చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళ(Kerala)కు చెందిన డిప్యూటీ తహశీల్దార్ పవిత్రన్ అనే వ్యక్తి విమాన ప్రమాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన నర్సు రంజితపై పవిత్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో తిడుతూ పోస్ట్ పెట్టాడు. ఎయిరిండియా పైలట్ విమానాన్ని ఆటోలా నడిపి మెడికల్ కాలేజీపై ల్యాండ్ చేశాడని పోస్ట్ పెట్టాడు. అంతేగాకుండా వారి మృతిపట్ల తనకు సానుభూతి లేదని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.