అక్షరటుడే, వెబ్డెస్క్:NEET Results | మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం మే 4న నీట్ పరీక్ష (NEET Exam) నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 20.8 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. రాజస్థాన్కు చెందిన మహేశ్కుమార్ నీట్లో జాతీయ స్థాయి మొదటి ర్యాంకు సాధించాడు.
నీట్ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు వివరాలు..
1 మహేశ్కుమార్ (రాజస్థాన్)
2 ఉత్కర్ష అవాదియ (మధ్య ప్రదేశ్)
3 క్రిషాంగ్ జోషి (మహారాష్ట్ర)
4 మృణాల్ కిశోర్ జా (ఢిల్లీ)
5 అవికా అగర్వాల్ (ఢిల్లీ)
6 జెనిల్ వినోద్బాయి బాయని (గుజరాత్)
7 కేశవ్ మిట్టల్ (పంజాబ్)
8 జా భవ్య చిరాగ్ (గుజరాత్)
9 హర్ష్ కేదావత్ (ఢిల్లీ)
10 ఆరావ్ అగర్వాల్ (మహారాష్ట్ర)
కాగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరూ కూడా టాప్–10లో ర్యాంక్ సాధించలేకపోయారు.