అక్షరటుడే, వెబ్డెస్క్ : Goa | లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే.. చదువుకుని, ఉద్యోగం సంపాదించి, మంచి అబ్బాయినో, అమ్మాయినో చూసి పెళ్లి చేసుకోవడం. ఇదే మొన్నటిదాకా అందరి ఫార్ములా.. అయితే ఇప్పుడిప్పుడే రోజులు మారాయి. వయసు పెరిగిపోతున్నా పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉంటున్నారు చాలామంది. అదేమంటే ‘అంత రిస్క్ చేయలేం’ అంటున్నారు. చాలామంది యువత పెళ్లి తర్వాత వచ్చే కొన్ని చిన్నచిన్న భయాలతోనే పెళ్లికి దూరంగా ఉంటున్నారట. రాబోయే పార్ట్నర్ బిహేవియర్ ఎలా ఉంటుందో.. అనే అనుమానం, చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తుందనే ఆలోచన.. ఇలాంటి భయాల వల్లే చాలామంది పెళ్లికి దూరంగా ఉంటున్నారని సర్వేలు చెబుతున్నాయి.
Goa | ఇదో కొత్త ట్విస్ట్..
కొద్ది రోజుల క్రితం రాజ్-సోనమ్ Sonam ఇష్యూ ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియుడితో కలిసి సొంత భర్తనే చంపించిన సోనమ్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు ప్రయాగ్రాజ్(Prayagraj)లోని సరాయ్ మామరేజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఖుర్రం షాపూర్(Khurram Shahpur) నివాసి అయిన సచిన్ బింద్ గోవా(Goa)లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను తన భార్య నిషా దేవితో కలిసి అక్కడే నివసించాడు. జూన్ 3న, సచిన్ తన భార్యతో కలిసి భడోహి(Bhadohi)లోని తన అత్తమామల ఇంటికి వెళ్లాడు. జూన్ 4న ఇద్దరూ గోవాకు వెళ్లారు. కానీ భార్య నిషా దేవి తిరిగి తన తల్లి ఇంటికి వచ్చింది. అయితే సచిన్ కనిపించకుండా పోయాడు.
దీంతో సచిన్ తల్లి సరాయ్ మామరేజ్ పోలీస్ స్టేషన్(Goa police station)లో ఫిర్యాదు చేసింది. లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చి, తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. నా కుమారుడి జాడ తెలుసుకునే ప్రయత్నం చేయండని కోరింది. భార్యతో ప్రయాణిస్తున్న భర్త అకస్మాత్తుగా ఎలా అదృశ్యమయ్యాడనేది పోలీసుల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విషయంలో, సరాయ్ మామరేజ్ ఇన్స్పెక్టర్ యోగేష్ ప్రతాప్ సింగ్(Inspector Yogesh Pratap Singh) మాట్లాడుతూ.. తప్పిపోయిన యువకుడి తల్లి పోలీస్ స్టేషన్లో తన కుమారుడు తప్పిపోయినట్లు కంప్లైంట్ ఇచ్చిందని తెలిపాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.