అక్షరటుడే, వెబ్డెస్క్: Black box | అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద స్థలంలో బ్లాక్బాక్స్ దొరికిందని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India plane crash) అనంతరం తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన ప్రాంతం నుంచి బ్లాక్బాక్స్ను (black box) వెలికితీయడం జరిగిందన్నారు. దాని డేటాను డీకోడ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఘటనపై విస్తృత స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఘటన జరగగానే విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ(AAIB)ను అప్రమత్తం చేశామన్నారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో బ్లాక్ బాక్స్ను వెలికితీసినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Black box | బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తే ఏం జరిగిందో తెలిసే అవకాశం
బ్లాక్ బాక్స్ను (black box) డీకోడ్ చేయడం వద్ద ప్రమాద సమయంలో లేదా అంతకంటే ముందుగా ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. దాని ద్వారా లోతైన సమాచారం లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. AAIB నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ ఘటన తర్వాత బోయింగ్ 787 సిరీస్ విమానాలపై (Boeing 787 series aircraft) విస్తృత నిఘా అవసరమని గుర్తించామని పేర్కొన్నారు. ఇప్పటికే 8 విమానాలను తనిఖీ చేశామని.. మిగతా వాటిని తనిఖీ చేస్తామని చెప్పారు.