అక్షరటుడే, వెబ్డెస్క్:NEET Results | దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలు (Neet results 2025) విడుదలయ్యాయి. వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నీట్ పరీక్ష (NEET Exam) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల కోసం విద్యార్థులు (Students) ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో శనివారం ఫలితాలను విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది 20.8 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. గతేడాది 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 72,507 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో 33 ప్రభుత్వ, 29 ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. రెండు డీమ్డ్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. వీటిలో మొత్తం 8,515 ఎంబీబీఎస్ ఉన్నాయి. నీట్ ఫలితాల ఆధారంగా ఆయా సీట్లను భర్తీ చేయనున్నారు.