అక్షరటుడే, వెబ్డెస్క్:Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel) భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం 265 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఆ సంఖ్య 274కు చేరింది.
Ahmedabad Plane Crash | 33 మంది మెడికోల మృతి
విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది 241 మంది ప్రమాదంలో మరణించారు. ఫ్లైట్లో నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే విమానం హాస్టల్ భవనం(Hostel building)పై కూలడంతో అందులోని వైద్య విద్యార్థులు(Medical students) చనిపోయారు. మొదట 24 మంది చనిపోగా.. తాజాగా ఆ సంఖ్య 33 కు చేరింది. శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉన్నాయేమోనని అధికారులు గాలిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Ahmedabad Plane Crash | ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న డీజీసీఏ, ఎన్ఏఐ
విమాన ప్రమాదం చోటు చేసుకున్న స్థలాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు పరిశీలించనున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు విమాన శకలాలు తొలగించొద్దని డీజీసీఏ ఆదేశించింది. దీంతో ఘటనా స్థలంలో శకలల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు(NIA officers) ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఎన్ఐఏ అధికారుల పరిశీలన మరో మరో మృతదేహం బయటపడింది.కుట్రకోణం ఉందనే అనుమానంతో ఎన్ఐఏ విచారణ చేపడుతోంది.