అక్షరటుడే, వెబ్డెస్క్: Indigo | ఇరాన్ – ఇజ్రాయెల్(Iran – Israel) ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడులు చేసిన విషయం తెలిసిందే. 200 యుద్ధ విమానాలతో టెల్అవీవ్ దాడులకు(Tel Aviv attacks) పాల్పడింది. దీంతో ఇరాన్ తన గగనతలాన్ని మూసి వేసింది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్(Indigo Airlines) ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
ఇరాన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు విమాన సేవలు(Flight services) అందుబాటులో ఉండవని ఇండిగో ప్రకటించింది. అలాగే విమానాలను దారి మళ్లించే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రయాణాలు ఆలస్యం అవ్వొచ్చని వెల్లడించింది. ప్రయాణికులు ఎయిర్పోర్టుకి బయలుదేరడానికి ముందు.. ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలని సూచించింది. ఇరాన్ తన గగనతలాన్ని మూసి వేయడంతో శుక్రవారం ముంబై నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం మూడు గంటలు గాలిలోనే ఉండి తిరిగి వచ్చింది. పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. ఈ క్రమంలో ఇండిగో ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది.