More
    HomeజాతీయంAhmedabad Plane Crash | విమాన ప్ర‌మాదం… ప్రమాద స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ వేడితో...

    Ahmedabad Plane Crash | విమాన ప్ర‌మాదం… ప్రమాద స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ వేడితో మంట‌లా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచాన్ని బాధలో ముంచేలా చేసింది. ఈ ప్రమాదంలో 241 మంది విమానంలో ఉన్నవాళ్లు, అలాగే విమానం కూలిన ప్రాంతంలో ఉన్న మరికొంత మంది మరణించారు. ఈ దుర్ఘటన తర్వాత తర్వాత ఏదైనా మిగిలి ఉంటే.. అవి ప్రశ్నలు మాత్రమే. విమానం Flight కూలిపోవడానికి సాంకేతిక లోపం కారణమా? నిర్లక్ష్యం వల్ల జరిగిందా? లేదా మన దేశంపై కుట్రతో ఎవరైనా సైబర్‌ దాడి చేసి.. విమానం కూల్చేశారా? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది.

    Ahmedabad Plane Crash | అంత వేడా..

    వాతావరణం కూడా పూర్తి అనుకూలంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ అవుతున్నట్లు కనిపించిన విమానం కొంచెం ఎత్తుకు చేరుకున్న తర్వాత ఎలా పడిపోయింది? ఫ్లాప్‌లను తప్పుగా అమర్చడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? ఇంజిన్‌కు తక్కువ థ్రస్ట్ పవర్ వచ్చిందా? లేదా 3505 మీటర్ల రన్‌వే నుండి సమయానికి ముందే విమానం టేకాఫ్ అయిందా? ల్యాండింగ్ గేర్ సమయానికి పైకి లేవలేదా? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణకు రాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న SDRF బృందాలు తీవ్రతను వివరిస్తూ, సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారాయని పేర్కొన్నాయి. మంటల తీవ్రత కారణంగా ఎవ్వరూ పరిసర ప్రాంతానికి చేరుకోలేకపోయారు.

    READ ALSO  Plane Crash | విమానంపై సైబర్‌ దాడి జరిగిందా..? ఆపరేటింగ్‌ సిస్టమ్‌ హ్యాక్‌ అయిందా..? ఎవరి హస్తమైనా ఉందా..?

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మాట్లాడుతూ.. ఆ విమానంలో సుమారు 1.25 లక్షల లీటర్ల విమాన ఇంధనం ఉంద‌ని, అది పేలిపోవడం వల్ల మంటలు క్షణాల్లో వ్యాపించాయని వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఉష్ణోగ్రత సుమారు 1000 డిగ్రీల సెల్సియస్‌కు చేరిందని, ఎవరూ బయటపడే అవకాశం లేకుండా మంటలు వ్యాపించాయ‌ని పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల మధ్య SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికే కొంతమంది ప్రాంత ప్రజలు కొందరిని శిథిలాల నుంచి బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. అయితే మంటలు అనూహ్యంగా వ్యాపించడంతో సహాయక చర్యలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక అధికారి మాట్లాడుతూ, “ఇంతటి విపత్కరమైన దృశ్యం మేము గతంలో ఎప్పుడూ చూడలేదు. విమానం పూర్తిగా అగ్నికి ఆహుతయిన తర్వాత ఆ ప్రాంతంలోని పక్షులు, కుక్కలు కూడా మంటల నుంచి తప్పించుకోలేకపోయాయి. చుట్టూ అన్నీ శిథిలాలే. మంటల్లో కాలిపోయిన ప్రయాణికుల మృతదేహాల గుర్తింపు కూడా ఒక పెద్ద సవాలుగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

    READ ALSO  Weather Report | అక్కడ మండుతున్న ఎండలు.. ఇక్కడ భారీ వర్షాలు

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....