అక్షరటుడే, ఇందూరు: KITS | నగరంలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాల (Kakatiya Women’s Engineering College) విద్యార్థులు శుక్రవారం ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించగా.. ముఖ్య అతిథిగా కిట్స్ డైరెక్టర్ రజనీకాంత్ (KITS director Rajinikanth) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అనంతరం విద్యార్థినుల నృత్యాలు అలరించాయి. సాంప్రదాయ చీరకట్టులో విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సెల్వరాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ సాయ రెడ్డి, వేణుగోపాల్, ఆయా విభాగాధిపతులు పాల్గొన్నారు.


కళాశాల విద్యార్థినులతో కిట్స్ డైరెక్టర్ రజనీకాంత్, అధ్యాపక బృందం