అక్షరటుడే, వెబ్డెస్క్:Ahmedabad Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరగ్గా, ఆ ప్రమాదంలో మొత్తం 250కి పైగా మృతి చెందారు. అయితే మృతుల్లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ(Chief Minister Vijay Rupani) ఉన్నారు. ప్రమాదం జరిగిన ఆయన టికెట్ ఫొటో వైరల్గా మారగా, ఆ తర్వాత బీజేపీ మరణించినట్లు ధ్రువీకరించింది. అయితే.. ఈ సందర్భంగా.. ఆయన అదృష్ట సంఖ్యపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఆయన 1206 అనే సంఖ్యను తన లక్కీ నంబర్గా Lucky number భావించేవారట. విజయ్ రూపానీకి సంబంధించిన అన్ని వాహనాల నంబర్ కూడా 1206 అని ఉంటుంది. కానీ అదే నంబర్ వచ్చే రోజున ఆయన చనిపోవడం కలిచివేస్తోంది
Ahmedabad Plane Crash | ఆ తేదీ రోజునే..
నిన్న జూన్ 12. అంటే.. 1206 వస్తుంది. దీంతో మాజీ సీఎం అదృష్ట సంఖ్య.. దురదృష్టంగా మారిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విజయ్ రూపానీ ఎప్పుడు బైక్ నుంచి కారు వరకు వాహనాలు అన్నింటి నెంబర్ ప్లేట్ 1206 ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉన్న విమానం ప్రమాదానికి గురైన తేదీ 12-06. దీంతో ప్రమాదం తేదీ, ఆయన లక్కీగా భావించే నెంబర్ రెండూ యాదృచ్ఛికంగా ఒకటే అయ్యాయి. కాగా, విజయ్ రూపానీకి విశ్వసనీయ నేతగా పేరుంది. ముఖ్యమంత్రిగా (Chief Minister) పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించారు. అంతకుముందు కార్పొరేటర్గా, మేయర్గా, గుజరాత్ మంత్రిగా పని చేశారు. రూపానీకి భార్య అంజలి, కుమారుడు రుషబ్, కుమార్తె రాధిక ఉన్నారు. మరో కుమారుడు పూజిత్ రూపానీ గతంలో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు.
68 ఏళ్ల విజయ్ రూపానీ (Vijay Rupani) అసలు పేరు విజయ్భాయ్ రామ్నిక్లాల్భాయ్ రూపానీ. ఆయన 1956 ఆగస్టు 2వ తేదీన మయన్మార్లోని యాంగూన్లో జన్మించారు. కానీ చిన్నప్పుడే ఆయన కుటుంబం రాజ్కోట్కు తరలివచ్చింది. పాఠశాల రోజుల్లోనే ఆయన ఆరెస్సెస్ పట్ల ఆకర్షితులయ్యారు. రాజ్కోట్లోని ధర్మేంద్ర సిన్హ్జీ ఆర్ట్స్ కళాశాల(Dharmendrasinhji Arts College)లో చదువుకున్నారు. బీఏతో పాటు ఎల్ఎల్బీ చదివారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో చేరి విద్యార్థి నేతగా ఎదిగారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 11 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1987లో రాజ్కోట్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 1996-1997 మధ్య రాజ్కోట్ మేయర్గా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అనంతరం 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా.. గుజరాత్ మాజీ సీఎం బల్వంత్రాయ్ మెహతా కూడా 1965లో విమాన ప్రమాదంలో చనిపోయారు. అలాగే అరుణాచల్ సీఎం ఖండూ కూడా విమాన ప్రమాదంలోనే కన్నుమూశారు.