అక్షరటుడే, వెబ్డెస్క్: Emergency Landing | వరుస ఘటనలతో విమానాల్లో ప్రయాణించే వారు ఆందోళన చెందుతున్నారు. గురువారం అహ్మదాబాద్(Ahmedabad)లో విమానం కూలిపోయి ప్రయాణికులు సహా 265 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పలు విమానాలు రద్దయ్యాయి. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం(Air India plane) ఏకంగా మూడు గంటలు గాలిలోనే ఉండిపోయింది.
అనంతరం తిరిగి ముంబయి ఎయిర్పోర్టు(Mumbai Airport)కు చేరుకుంది. తాజాగా మరో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency landing) అయ్యింది. ఎయిర్ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు(Bomb threat) రావడం తీవ్ర కలకలం రేపింది. థాయ్లాండ్లోని పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అండమాన్ సముద్రంపై కొద్దిసేపు విమానం చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు థాయిలాండ్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. లాండ్ అయిన తర్వాత ప్రయాణికులను దించేసి విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.