అక్షరటుడే, వెబ్డెస్క్: plane crash : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad)లో జరిగిన ఫ్లైట్ క్రాష్లో 241 మంది చనిపోయారు. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిలో 169 మంది భారతీయులు(Indians), 52 మంది బ్రిటిషర్స్ Britons, ఏడుగురు పోర్చుగీస్ Portuguese, ఒక కెనెడియన్ Canadian ఉన్నారు.
ఫ్లైట్ క్రాష్లో చనిపోయిన వారిలో బ్రిటిషర్స్ కూడా ఉండటంతో ఈ ఘటన అంతర్జాతీయ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం స్పందించింది.
విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపడానికి UK తమ దర్యాప్తు బృందాన్ని అహ్మదాబాద్కు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. వీరు ఇండియాకు చేరుకున్నాక, విమాన ప్రమాదంపై సమగ్రంగా విచారణ చేపట్టనున్నారు. ఈ విషాద సంఘటనలో 52 మంది బ్రిటిష్ జాతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు విషయం అంతర్జాతీయంగా మారింది.