అక్షరటుడే, వెబ్డెస్క్: plane crash : గుజరాత్ లో విమాన ప్రమాదం(Gujarat flight accident) ఘటన యావత్ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Ahmedabad International Airport) నుంచి బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్ ఇండియా విమానం(Air India plane) కుప్పకూలి 241 మందిని బలిగొంది. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్ను ఢీ కొడుతూ వెళ్లడంతో అందులోని 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
కాగా, ఈ భయానక ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్పందించారు. వెంటనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎంతో మాట్లాడారు. స్థలంలో అందుతున్న సహాయక చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ‘ఇది మాటలకు అందని విషాదమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా.. నేడు గుజరాత్కు మోదీ వెళ్లనున్నారు. ఘటన జరిగిన తీరును పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.