More
    HomeజాతీయంPlane Crash | విమానం కూలిన ఘటన.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

    Plane Crash | విమానం కూలిన ఘటన.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: plane crash : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad)​లో జరిగిన ఫ్లైట్ క్రాష్​లో 242 మంది చనిపోయారు. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిలో 169 భారతీయులు(Indians), 53 మంది బ్రిటిషర్స్ Britons, ఏడుగురు పోర్చుగీస్​ Portuguese, ఒక కెనెడియన్​ Canadian ఉన్నారు.

    కాగా, మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. రాజస్థాన్ బన్స్వారా Banswara, Rajasthan నుంచి లండన్ London ​కు వెళ్తున్న ప్రతీక్ జోషీ- డాక్టర్ కోమీ వ్యాస్ దంపతులు, వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విమానంలో వారు నవ్వుతూ తీసుకున్న ఆఖరి సెల్ఫీ అందరినీ చెమ్మగిల్లేలా చేస్తోంది. కాగా.. మృతదేహాలకు DNA పరీక్షల అనంతరం వారివారి కుటుంబాలకు అప్పగించనున్నారు. ఇందుకోసం సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు తమవారి చివరి చూపుకోసం మృతుల తాలుకా వేలాది మంది కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని విలపిస్తున్నారు.

    READ ALSO  Ahmadabad Plane Crash | పది నిమిషాలు ఆలస్యం.. యువతి ప్రాణాలు కాపాడింది

    plane crash : ఆరేళ్ల కల నెరవేరుతుందనుకుంటే..

    ప్రతీక్ జోషి ఆరు సంవత్సరాలుగా లండన్‌లో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన ఆయన, తన భార్య, ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి విదేశాల్లో జీవించాలని ఎన్నో కలలు కన్నారు. ప్రతీక్​ లండన్​లో ఉంటే.. ఆయన భార్య, ముగ్గురు పిల్లలు భారతదేశంలోనే ఉండేవారు.

    సంవత్సరాలుగా వేచి ఉన్న తర్వాత తన కల చివరకు నెరవేరే సమయం వచ్చిందని ప్రతీష్​ ఎంతో సంతోషించారు. రెండు రోజుల క్రితమే ఉదయపూర్‌లో ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

    విదేశాలకు వెళ్లేందుకు ఉదయమే బ్యాగులు సర్దుకున్నారు. తమ భవిష్యత్తు గురించి కలలు కంటూ అందరికీ వీడ్కోలు పలికారు.

    ఎంతో ఉత్సాహంతో ఐదుగురు సభ్యుల కుటుంబం లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం 171 ఎక్కింది. ఫ్లైట్​లో వారు సెల్ఫీ తీసుకున్నారు. దానిని బంధువులకు కూడా పంపారు. కొత్త జీవితానికి ప్రయాణం మొదలెట్టామని అనుకున్నారు. కానీ, తిరిగిరాని లోకానికి వెళ్తున్నట్లు వారికి తెలియదు.

    READ ALSO  Bike Taxi | నిలిచిపోనున్న బైక్​ ట్యాక్సీల సేవలు.. ఎక్కడంటే..

    ఫ్లైట్​ క్రాష్​తో కొన్ని క్షణాల్లోనే వారి జీవిత కలలు బూడిదగా మారాయి.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....