More
    HomeజాతీయంAir India Plane Crash | విమాన ప్ర‌మాదం.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన టాటా గ్రూప్

    Air India Plane Crash | విమాన ప్ర‌మాదం.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన టాటా గ్రూప్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India Plane Crash : అహ్మదాబాద్ లో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదం యావత్ దేశాన్ని కదిలించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 240 మందికి పైగా మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది.

    గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Sardar Vallabhbhai Patel International Airport) నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిపోయింది. లండన్‌కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో అంద‌రు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న కేంద్ర‌మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister) అక్క‌డికి చేరుకొని అక్క‌డ ఘటనపై ఆరతీశారు.

    READ ALSO  Plane Crash | మెడిక‌ల్ హాస్ట‌ల్ బిల్డింగ్‌ను ఢీకొన్న విమానం.. పలువురు మెడికోలు మృతి

    Air India Plane Crash : భారీ ఎక్స్‌గ్రేషియా..

    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation – DGCA) ప్రకారం.. విమానంలో 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయిన స్వల్ప వ్యవధిలోనే ఈ దుర్ఘటన జరిగిపోయింది.

    కొద్ది రోజుల క్రితమే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జూన్ 7న ఢిల్లీ నుంచి పారిస్ వెళ్తున్న విమానంలో సమస్య తలెత్తడంతో ఎలక్ట్రిక్ ఎర్రర్, కాలిన వాసన రావడంతో షార్జా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. తక్షణమే పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో నాడు ప్రమాదం తప్పింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విమానం కూడా ఎయిర్ ఇండియా (AI 143) వినియోగించిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ రకమే కావడం గమనార్హం.

    READ ALSO  plane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

    కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన వారికి టాటా గ్రూప్ TATA GROUP భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ (Tata Group Chairman Chandrasekaran) ప్రకటించారు. అలాగే విమాన ప్రమాద సమయంలో దెబ్బ తిన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ ను కూడా పునర్మిస్తామని కూడా తెలిపారు.

    అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అద్భుతం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. “పోలీసులు 11A సీటులో ప్రాణాలతో బయటపడిన ఒకరిని కనుగొన్నారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరణాల సంఖ్య గురించి ఇంకా ఏమీ చెప్పలేం. విమానం నివాస ప్రాంతంలో కూలిపోవడంతో మరణాల సంఖ్య పెరగవచ్చు.” అని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ GS maalik మాలిక్ తెలిపారు.

    READ ALSO  Plane crash | 274కు చేరిన మృతుల సంఖ్య.. విమాన ప్రమాదంపై దర్యాప్తునకు హైలెవెల్ కమిటీ

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....