అక్షరటుడే, వెబ్డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్లో విమాన ప్రమాదం (Ahmedabad Plane crash) లో అందులో ఉన్న వారు మొత్తం మరణించినట్లు అధికారులు తెలిపారు. దేశ చరిత్రలో ఇది పెద్ద విమాన ప్రమాదం. తీవ్ర విషాదం నింపిన ఈ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ (Delhi to Ahmedabad) వచ్చింది. అక్కడి నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఓ ప్రయాణికులు విమానంలో సమస్యలు ఉన్నట్లు ప్రమాదానికి ముందే ట్వీట్ చేశాడు. ఏసీ పని చేయడం లేదని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వీడియో తీసి ఎయిర్ ఇండియా (Air India)కు ట్యాగ్ చేశాడు. అయితే ఆయన అహ్మదాబాద్లో దిగిపోయాక ప్రమాదం జరిగింది. కాగా విమానంలో ఏసీలు పనిచేయడం లేదంటే.. సిబ్బంది టేకాఫ్కు ముందు పూర్తి స్థాయిలో చెక్ చేయలేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీట్కి ఉండే స్క్రీన్లు కూడా ఆన్ అవ్వడంలేదని, అసలు ఫ్లైట్ అంతా ఏదో తేడాగా ఉందన్నట్లు అతడు అనుమానం వ్యక్తం చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.