అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఎక్కువ శాతం భక్తులు రైలు మార్గంలోనే తిరుపతి చేరుకుంటారు. దీంతో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. రెండు, మూడు నెలల ముందుగానే టికెట్లు రిజర్వ్ అయిపోతాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. కరీంనగర్ నుంచి తిరుపతికి (Karimnagar to Tirupati) ఎనిమిది ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.
తిరుపతి నుంచి కరీంనగర్కు జూలై 6 నుంచి 27 వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలు (Special Train) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం నాలుగు సర్వీసులు నడుపుతామని తెలిపింది. అలాగే కరీంనగర్ నుంచి తిరుపతికి జూలై 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం ఒక రైలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ రైళ్లు పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికులు ఈ రైలు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.