అక్షరటుడే, వెబ్డెస్క్: Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో జరిగిన విమానం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ (Ahmedabad to London) గాట్విక్కు బయలుదేరిన AI 171 విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు (passengers), సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ ఉన్నారు. దీంతో అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల సమాచారం కోసం 1800 5691 444 హాట్లైన్ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు.
కాగా.. ప్రమాదంలో సుమారు వంద మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విమానంలో ప్రయాణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన సైతం మృతి చెందినట్లు సమాచారం.