More
    HomeజాతీయంFlight Crashes | విషాదం నింపిన విమాన ప్రమాదాలు.. గతంలో చోటు చేసుకున్న ఘటనలివే..

    Flight Crashes | విషాదం నింపిన విమాన ప్రమాదాలు.. గతంలో చోటు చేసుకున్న ఘటనలివే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Flight Crashes | గుజరాత్​లోని అహ్మదాబాద్(Ahmedabad)​లో గురువారం లండన్ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India plane) కూలిపోయింది. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎంతో మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్​ క్రూ సిబ్బందితో పాటు 230 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా.. దేశంలో గతంలోనూ విమాన ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందారు. గతంలో జరిగిన ప్రమాదాలు ఇవే..

    1949 జూలై 2 : ఇండోనేషియాలోని జకార్తా నుంచి నెదర్లాండ్​ వెళ్తున్న విమానం ముంబయి(Mumbai)లో కూలిపోయింది. వాతావరణం బాగా లేకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్​కు ప్రయత్నిస్తుండగా ముంబయిలోని ఘట్కోబార్​ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించారు.
    1962 జూలై 7న అలిటాలియా విమానం 771 ముంబైకి ఈశాన్యంగా ఉన్న కొండను సమీపిస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదం నావిగేషన్ లోపంతో జరిగింది. ప్రమాదంలో విమానంలోని 94 మంది మరణించారు.

    1963 జూలై 28 : యునైటెడ్ అరబ్ ఎయిర్‌లైన్స్ విమానం ముంబై విమానాశ్రయం(Mumbai Airport)లో కూలిపోయింది. అందులో ఉన్న 63 మంది మరణించారు. వాతావరణం బాగా లేకపోవడంతో పైలట్​ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది.

    READ ALSO  South Central Railway | తగ్గనున్న దక్షిణ మధ్య రైల్వే పరిధి

    1972 జూన్ 14 : జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం ఢిల్లీలోని పాలం(ఇందిరాగాంధీ) విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. విమానంలో ఉన్న 87 మందిలో 82 మంది మరణించారు. ఆ సమయంలో అక్కడున్న ముగ్గురు స్థానికులు సైతం చనిపోయారు.

    1973 మే 31 : ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరువలో పైలట్ తప్పిదం కారణంగా కూలిపోయింది. విమానంలో ఉన్న 65 మందిలో 48 మంది మరణించారు.

    1976 అక్టోబర్​ 12 : ఇంజిన్ వైఫల్యంతో మంటలు చెలరేగడంతో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం బొంబాయిలో కూలిపోయింది. విమానంలో ఉన్న 95 మంది మరణించారు.

    1978 జనవరి 1 : కాక్‌పిట్‌లోని విమాన పరికరాల్లో ఒకటి చెడిపోవడంతో కెప్టెన్ నియంత్రణ కోల్పోయి ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలిపోయింది. అందులో ఉన్న 213 మంది మృతి చెందారు.

    1982 జూన్ 21 : ముంబైలోని సహార్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం క్రాష్​ అయింది. బ్యాడ్​ వెదర్​ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది 15 మంది ప్రయాణికులు చనిపోగా, 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

    READ ALSO  Plane Crash | విమానం కూలిన ఘటన.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

    1988 అక్టోబర్ 19 : అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకునే సమయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. పైలట్​ తప్పిదంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 130 మంది మరణించారు.

    1990 ఫిబ్రవరి 14 : ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకునే ప్రయత్నంలో కూలిపోయింది. 92 మంది మరణించారు.

    1991 ఆగస్టు 16 : ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంఫాల్‌లో ల్యాండ్​ అవుతుండగా పైలట్ తప్పిదంతో కూలిపోయింది. అందులోని 69 మంది ప్రయాణికులు మరణించారు.

    1993 ఏప్రిల్ 26 : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి బయలుదేరుతుండగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే చివరన ఒక ట్రక్కును ఢీకొట్టింది. పైలట్ తప్పిదం, హైవే ట్రాఫిక్‌ను నియంత్రించడంలో విమానయాన యంత్రాంగం వైఫల్యంతో ప్రమాదం చోటు చేసుకుంది.

    1996 నవంబర్ 12 : సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ విమానం(Airlines plane), కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే ఢీకొన్నాయి. కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ పైలట్ చేసిన తప్పిదంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు విమానాల్లో ఉన్న 349 మంది కూడా మరణించారు. సౌదీ విమానం ఆ సమయంలో ఢిల్లీ నుంచి వెళ్తోంది.

    READ ALSO  Ahmedabad Plane Crash | టేకాఫ్‌కి ముందే అనుమానం వ్య‌క్తం చేసిన మ‌హిళ‌.. భ‌ర్త‌కి కాల్ చేసి మ‌రీ కూడా చెప్పింది..!

    2000 జూలై 17: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ పాట్నాలోని ఒక నివాస ఎస్టేట్‌లో కూలిపోయింది. విమానంలోని 55 మంది, స్థానికులు ఐదుగురు మృతి చెందారు.

    2010 మే 22 : దుబాయ్-మంగళూరు మార్గంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంగళూరు విమానాశ్రయంలో క్రాష్ అయింది. ల్యాండింగ్ అవుతుండగా రన్​ వేను దాటి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. విమానంలోని 158 మంది ప్రయాణికులు మరణించారు.

    2020 ఆగస్టు 7 : దుబాయ్-కోళికోడ్ మార్గంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగు ముక్కలైంది. ల్యాండింగ్ అవుతుండగా రన్‌వేను దాటి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. 18 మంది మృతి చెందారు.

    ఇవే కాకుండా పలు ఇండియన్​ ఎయిర్ ఫోర్స్​కు చెందిన విమానాలు సైతం ప్రమాదాల బారీన పలువురు సిబ్బంది మృతి చెందారు.

    Latest articles

    Rythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rythu Nestham | రైతులకు వ్యవసాయ సూచనలు అందించడానికి ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన...

    Fuji Film Workshop | కెమెరామెన్లకు ఫోటోగ్రఫీపై వర్క్​షాప్​

    అక్షరటుడే, ఇందూరు:Fuji Film Workshop | ఫ్యూజి ఫిల్మ్​ సంస్థ ఆధ్వర్యంలో కెమెరామెన్లకు ఒకరోజు వర్క్​షాప్​ ఏర్పాటు చేశారు....

    Gadwal | రీల్స్ పిచ్చి.. ట్రాక్టర్​పై పడుకొని డ్రైవింగ్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gadwal | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది చనిపోతున్నారు. అయినా చాలా మంది ట్రాఫిక్​...

    Gold Mining | భూగ‌ర్భం లోప‌ల నెలల తరబడి ఉండి బంగారం త‌వ్వుతా.. కుప్పలుగా అస్తిపంజ‌రాలు కనిపిస్తాయి.. అక్రమ మైనింగ్ లో పనిచేసే ఓ వ్యక్తి గాథ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold Mining | దక్షిణాఫ్రికా(South Africa)లోని ఒక చిన్న పట్టణం… మాఫియా గ్యాంగ్‌లు నియంత్రించే ఈ...

    More like this

    Rythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rythu Nestham | రైతులకు వ్యవసాయ సూచనలు అందించడానికి ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన...

    Fuji Film Workshop | కెమెరామెన్లకు ఫోటోగ్రఫీపై వర్క్​షాప్​

    అక్షరటుడే, ఇందూరు:Fuji Film Workshop | ఫ్యూజి ఫిల్మ్​ సంస్థ ఆధ్వర్యంలో కెమెరామెన్లకు ఒకరోజు వర్క్​షాప్​ ఏర్పాటు చేశారు....

    Gadwal | రీల్స్ పిచ్చి.. ట్రాక్టర్​పై పడుకొని డ్రైవింగ్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Gadwal | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది చనిపోతున్నారు. అయినా చాలా మంది ట్రాఫిక్​...