అక్షరటుడే, వెబ్డెస్క్: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంలో కలకలం రేపింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 242 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్యపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 1.17 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే కుప్పకూలింది. అనంతరం ఫైట్ నుంచి దట్టమైన మంటలు వ్యాపించాయి. ఏవియేషన్ అధికారులు, స్థానిక పోలీసులు పదుల కొద్దీ ఫైర్ ఇంజన్లను మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్ బయటకు వచ్చింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్ పోర్టు మూసివేసినట్లు సమాచారం.